పండుగ తర్వాత మరో 5 వేల ఇళ్లకు ఓటీఎస్
ABN , First Publish Date - 2022-01-15T07:31:46+05:30 IST
ఓటీఎ్సపై అధికారులు మరోసారి దృష్టి సారించారు.
చిత్తూరు (సెంట్రల్), జనవరి 14: వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎ్స)పై అధికారులు మరోసారి దృష్టి సారించారు. ఈనెల 10న మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించిన హౌసింగ్ అధికారులు 5387మంది నుంచి రూ.6.09 కోట్లు వసూలు చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత 20వ తేదీలోగా మరో ఐదు వేల ఇళ్లు ఓటీఎస్ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. జిల్లాలో ఓటీఎస్ లక్ష్యం 19,713 ఇళ్లు కాగా, ఇప్పటికి 5387 పూర్తయ్యాయి. పండుగ తర్వాత మరో 5 వేలు పూర్తి చేసేలా అధికారులు సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. వీటినీ మహిళా సంఘాలను లక్ష్యంగా చేసుకుని పూర్తి చేయాలని భావిస్తున్నారు.