వ్యాక్సిన్‌ కోసం వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-05-07T09:51:06+05:30 IST

గుంటూరు జిల్లా రేపల్లెలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధుల్లో ఉన్న వైద్యురాలిపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. తాము చెప్పిన వారికి వ్యాక్సిన్‌ వేసి తీరాలంటూ రంకెలు వేశారు

వ్యాక్సిన్‌ కోసం వైసీపీ నేతల దౌర్జన్యం

రేపల్లెలో మహిళా డాక్టర్‌పై దుర్భాషలు, రంకెలు


రేపల్లె, మే 6: గుంటూరు జిల్లా రేపల్లెలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధుల్లో ఉన్న వైద్యురాలిపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. తాము చెప్పిన వారికి వ్యాక్సిన్‌ వేసి తీరాలంటూ రంకెలు వేశారు. వారికి భయపడి అక్కడ నుంచి పరిగెత్తుతున్న వైద్యురాలి వెంటపడి తరిమారు. రేపల్లె 17వార్డులోని చేనేత కార్మికుల సొసైటి వద్ద కొవిడ్‌ రెండో విడత వ్యాక్సినేషన్‌ వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాక్సిన్‌ వేయటం కుదరదని వైద్యురాలు అశ్విని కిరణ్‌ ఎంత మొత్తుకున్నా వైసీపీ నేతలు వినలేదు. మహిళా వైద్యురాలిని నానా దుర్భాషలాడారు. భయపడిన వైద్యురాలు అక్కడినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అనంతరం రెండో డోసు కోసం క్యూలో ఉన్నవారిని కాదని, తాము చెప్పిన వారందరికీ మొదటి డోస్‌ దౌర్జన్యంగా వేయించుకున్నారు.  

Updated Date - 2021-05-07T09:51:06+05:30 IST