వూహాన్‌లో 30 లక్షల మందికి కరోనా టెస్టులు పూర్తి!

ABN , First Publish Date - 2020-05-16T02:14:23+05:30 IST

కరోనా మహమ్మారి పుట్టిల్లు వూహాన్‌లో 30లక్షలమందికిపైగా ప్రజలకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

వూహాన్‌లో 30 లక్షల మందికి కరోనా టెస్టులు పూర్తి!

బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టిల్లు వూహాన్‌లో 30లక్షలమందికిపైగా ప్రజలకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కనుమరుగవడంతో ఈ ప్రాంతంలో లాక్‌డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మళ్లీ వూహాన్‌లో కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వూహాన్‌లోని మొత్తం 1.1కోట్లమందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం అందరికీ 10రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 30లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

Updated Date - 2020-05-16T02:14:23+05:30 IST