కరోనా తగ్గితే.. మళ్లీ వైరస్ ఎక్కిస్తామంటున్న ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ!

ABN , First Publish Date - 2021-04-20T11:14:48+05:30 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఎవరికైనా కరోనా సోకితే త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటారు. అయితే ఇలా తగ్గిన తర్వాత మరోసారి కరోనా వైరస్ ఎక్కించుకొనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాంటి వాళ్ల అవసరం ఉందంటోంది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.

కరోనా తగ్గితే.. మళ్లీ వైరస్ ఎక్కిస్తామంటున్న ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ!

వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఎవరికైనా కరోనా సోకితే త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటారు. అయితే ఇలా తగ్గిన తర్వాత మరోసారి కరోనా వైరస్ ఎక్కించుకొనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాంటి వాళ్ల అవసరం ఉందంటోంది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ. ఇదంతా అధ్యయనం కోసమే అని చెప్తోంది. ఈ పరిశోధన కోసం కరోనాతో పోరాడి గెలిచిన 64 మంది వాలంటీర్లను ఎంపిక చేస్తారట. 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండి, ఇటీవలి కాలంలో కరోనా సోకి తగ్గిన వారికి ఈ పరిశోధన కోసం మరోసారి కరోనా వైరస్ ఎక్కిస్తారని సమాచారం.


ఆపై వీరిని 17 రోజుల పాటు క్వారంటైన్ పరిస్థితుల్లో ఉంచి పర్యవేక్షించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకసారి కరోనా సోకిన వారికి మరోసారి ఆ వైరస్ సోకకుండా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికే ఈ పరిశోధన చేయనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-20T11:14:48+05:30 IST