కనిగిరి వైద్యశాలకు ఆక్సిజన్‌ సిలిండర్ల అందజేత

ABN , First Publish Date - 2021-05-18T06:56:47+05:30 IST

పట్టణంలోని ఏరియా వైద్యశాలకు 10 ఆక్సిజన్‌ సిలిండర్లను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పంపించారు.

కనిగిరి వైద్యశాలకు ఆక్సిజన్‌ సిలిండర్ల అందజేత

కనిగిరి, మే 17 : పట్టణంలోని ఏరియా వైద్యశాలకు 10 ఆక్సిజన్‌ సిలిండర్లను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పంపించారు. వీటిని నగర పంచాయతీ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ సోమవారం వైద్యశాల సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కనిగిరి ప్రాంత ప్రజలు ఆక్సిజన్‌ లేక పడుతున్న ఇబ్బందులను ఎంపీ మాగుంట దృష్టికి ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ తీసుకెళ్లారని చెప్పారు. స్పందించిన ఎంపీ తన సొంత ఖర్చులతో ఈ సిలిండర్లను పంపారని చెప్పారు. కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీత, డాక్టర్‌ సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు మడతల కస్తూరిరెడ్డి, రంగనాయకులరెడ్డి, ప్రైవేటు వైద్యుడు మురళీకృష్ణ, కౌన్సిలర్‌ శ్రీరామ సతీష్‌, పసుపులేటి అరుణోదర్‌, కోఆప్షన్‌ సభ్యుడు చింతం శ్రీనివాసులు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీహెచ్‌సికి ఆక్సిజన్‌ సిలిండర్లు వితరణ

దర్శి, మే 17: కరోనా రోగులకు సహకారం అందించే కార్యక్రమంలో భాగంగా మాగుంట రాఘవరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దర్శి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు సోమవారం పది ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చారు. ఆ సిలిండర్లను స్థానిక వైసీపీ నాయకులు బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి అందజేశారు. ఇటీవల ఎంపీ మాగుంట దర్శి సీహెచ్‌సీకి 30 పడకలను అందజేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆక్సిజన్‌ కొరత ఉన్న విషయం గుర్తించి పది ఆక్సిజన్‌ సిలిండర్లు పంపడంతో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించే అవకాశం లభించింది.  కార్యక్రమంలో స్థానిక నాయకులు శివారెడ్డి, జయరామిరెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T06:56:47+05:30 IST