అంబులెన్స్లో ఆక్సిజన్ కొరత.... తల్లి ఒడిలోనే శిశువు మృతి!
ABN , First Publish Date - 2020-05-28T17:53:44+05:30 IST
అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న శిశువును అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా ఆక్సిజన్ అందక మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గుణలో చోటుచేసుకుంది.
భోపాల్: అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న శిశువును అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా ఆక్సిజన్ అందక మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గుణలో చోటుచేసుకుంది. ఆ శిశువుకు న్యుమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో గుణ జిల్లా ఆసుపత్రి నుంచి గ్వాలియర్కు అంబులెన్స్లో వైద్యులు తరలించారు. అయితే 35 కిలోమీటర్ల దూరంవెళ్లాక అంబులెన్స్లో ఆక్సిజన్ అయిపోయింది. దీంతో ఆ శిశువు తల్లి ఒడిలోనే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ఆరోన్ నివాసి అనిల్ రెండు నెలల కుమార్తె కనక్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ శిశువును జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆ శిశువుకు న్యుమోనియాతో పాటు గుండె సమస్య ఉందని చెప్పారు. అలాగే ఆ శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గ్వాలియర్కు అంబులెన్స్లో తరలించారు. అయితే అంబులెన్స్లో ఆక్సిజన్ అయిపోవడంతో ఆ శిశువు మృతి చెందింది. అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ను నేరుగా శివపురి జిల్లా ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడి వైద్యులు ఆ శిశువును పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు.