ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్ల పెంపునకు చర్యలు
ABN , First Publish Date - 2021-05-06T05:34:58+05:30 IST
ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు.
సబ్ కలెక్టర్ మౌర్య
నర్సీపట్నం/అర్బన్, మే 5: ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. బుధవారం ఆస్పతిలో కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ నిల్వలు తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ కొరత ఎందుకు వస్తుంది, సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఎన్ని సిలిండర్లు అవసరమని డాక్టర్ నళినీప్రసాద్ను అడిగారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామన్నారు. గురుకుల పాఠశాలలో పురుషుల కోసం వంద బెడ్లతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో మహిళ కోసం కూడా ఒక సెంటర్ పెడతామన్నారు ఇన్చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్, వైద్యులు పాల్గొన్నారు.