పారదర్శకంగా రెవెన్యూ రికార్డులు : జేసీ
ABN , First Publish Date - 2022-01-21T02:51:51+05:30 IST
రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉండాలే చూడాలని జేసీ (రెవెన్యూ) హరేందిరా ప్రసాద్ అన్నారు. కావలి ఆర్డీవో కార్యాలయం
కావలి, జనవరి20: రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉండాలే చూడాలని జేసీ (రెవెన్యూ) హరేందిరా ప్రసాద్ అన్నారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో గురువారం నిషేధిత భూములపై డివిజన్ స్థాయిలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల జాబితా వల్ల రైతులు ఇబ్బందులు పడుతుండటంతో మండలాల వారీగా 22ఏ కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి వాటిపై సమీక్షించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. భూసర్వే పూర్తి అయ్యేనాటికి గ్రామాల్లో ఎక్కడా భూసమస్యలు లేకుండా చూడాలన్నారు. భూముల సాగులో ఉన్న రైతులే రికార్డులలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. తేడాలు ఉంటే సాగులో ఉన్న రైతులకు ఆ భూములు ఎలా వచ్చాయో తెలుసుకుని, వారి చేత మ్యుటేషన్ కట్టించి వాటిని రికార్డులలో ఎక్కించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శీనా నాయక్, డివిజన్లోని తహసీల్దారులు, ఆర్ఐలు, వీఆర్వోలు పాల్గొన్నారు.