సిద్దిపేట నుంచి శబరికి పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-24T04:50:33+05:30 IST

నారాయణపేట మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్‌ సిద్దిపేట నుంచి శబరికి పాదయాత్రగా బయలుదేరారు.

సిద్దిపేట నుంచి శబరికి పాదయాత్ర
పాదయాత్రగా వెళ్తున్న అశోక్‌గౌడ్‌

సిద్దిపేట రూరల్‌, అక్టోబరు 23: నారాయణపేట మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్‌ సిద్దిపేట నుంచి శబరికి పాదయాత్రగా బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద శనివారం నడకను ప్రారంభించి మాట్లాడారు. శబరిమలైకి కాలినడకన వస్తానని గత సంవత్సరం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, అల్లంపూర్‌, కర్నూల్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ మీదుగా 1,450 కిలోమీటర్ల పాదయాత్ర సాగుతుందని, డిసెంబరు 3 వరకు శబరికి చేరనున్నట్లు తెలిపారు.


 

Updated Date - 2021-10-24T04:50:33+05:30 IST