ఆత్మకూరు అభివృద్ధికి 2న పాదయాత్ర
ABN , First Publish Date - 2020-08-15T09:30:23+05:30 IST
ఆత్మకూరును జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 2న ఆత్మకూరు నుంచి నెల్లూరుకు పాదయాత్ర చేస్తున్నామని ఆత్మకూరు నియో
నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 14 : ఆత్మకూరును జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 2న ఆత్మకూరు నుంచి నెల్లూరుకు పాదయాత్ర చేస్తున్నామని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఆయన శుక్రవారం ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. పాదయత్రకు అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ఆత్మకూరు మాత్రం వెనుకబడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు జిల్లా కేంద్రంగా చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.