పాడిరైతుల అభ్యున్నతే ధ్యేయం
ABN , First Publish Date - 2021-10-17T06:14:37+05:30 IST
పాడిరైతుల అభ్యున్నతే ధ్యేయం
విజయ డెయిరీ చైర్మన్ చలసాని
గన్నవరం, అక్టోబరు 16 : పాడి రైతు ల అభ్యున్నతే ధ్యేయంగా విజయ డెయిరీ పని చేస్తుందని చైర్మన్ చలసాని ఆంజనే యులు అన్నారు. దావాజీగూడెం పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహ కార సంఘంలోని సభ్యులకు శనివారం బోనస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా జరిగిన సభకు సంఘ అధ్యక్షుడు గొంది నరేంద్ర అధ్యక్షత వహించగా చలసాని మాట్లాడుతూ పాడి రైతుల ను ప్రోత్స హించేందుకు బోనస్లు అంద జేస్తున్నామన్నారు. విజయ డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, జీఎం అనిల్ కుమార్, రూట్ మేనేజర్ యశ్వంత్ పాల్గొన్నారు.
హనుమాన్జంక్షన్ రూరల్ : రంగన్నగూడెం పాల సొసైటీ అధ్యక్షుడు మొవ్వా శ్రీనివాసరావు కుమార్తె కుసుమ వివాహానికి విజయ డెయిరీ చైర్మన్ చల సాని ఆంజనేయులు హాజరై వధూవరుల ను ఆశీర్వదించారు. కల్యాణమస్తుబంగారు నాణాన్ని బహూకరించారు. ఆళ్ల గోపాల కృష్ణారావు, రంగారావు పాల్గొన్నారు.