పొడ్చన్‌పల్లి విషాదఘటనపై పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి

ABN , First Publish Date - 2020-05-28T13:34:20+05:30 IST

పొడ్చన్‌పల్లి విషాదఘటనపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. నీళ్లు పడని బోరుబావుల

పొడ్చన్‌పల్లి విషాదఘటనపై పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి

మెదక్‌: పొడ్చన్‌పల్లి విషాదఘటనపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 


నిర్లక్ష్యంతోనే పొడ్చన్‌పల్లిలో విషాదం

అధికారులు, రిగ్‌ యజమానుల నిర్లక్ష్యంతోనే పొడ్చన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుందని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్‌రావు ఏబీఎన్‌తో అన్నారు. అధికారులు, రిగ్‌ యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు వాడటం లేదని ఆరోపించారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు పూడ్చివేయాలని కోరారు.


చర్యలు తీసుకుంటాం: కలెక్టర్‌ ధర్మారెడ్డి

బోరుబావి ఘటన దురదృష్టకరమని కలెక్టర్‌ ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బోరుబావికి అనుమతి లేదు... రిగ్గు ఓనర్‌పై కూడా చర్య తీసుకుంటామన్నారు.

Updated Date - 2020-05-28T13:34:20+05:30 IST