ఏసీబీ వలలో పద్మనాభ మండల సర్వేయర్

ABN , First Publish Date - 2021-08-26T20:34:12+05:30 IST

పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలకు చిక్కారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు

ఏసీబీ వలలో పద్మనాభ మండల సర్వేయర్

విశాఖ: పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలకు చిక్కారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బ్రాందేయపురంలో 4 ఎకరాల భూమి సర్వేకు ఉపేంద్ర 18వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం వ్యవహారంలో మరో ఇద్దరు సర్వేయర్లు సహకరించారు. సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లు ఏసీబీ అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-26T20:34:12+05:30 IST