కమల్‌ పార్టీ నుంచి వైదొలిగిన పద్మప్రియ

ABN , First Publish Date - 2021-05-14T17:13:47+05:30 IST

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ నుంచి పద్మప్రియ, సంతోష్‌బాబులు ..

కమల్‌ పార్టీ నుంచి వైదొలిగిన పద్మప్రియ

చెన్నై/ప్యారీస్: ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ నుంచి పద్మప్రియ, సంతోష్‌బాబులు వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎంఎన్‌ఎంలో చేరి మధురవాయల్‌ నియోజక వర్గం నుంచి పోటీచేసిన పద్మప్రియ, తాను పార్టీ సాధారణ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తన పట్ల ప్రేమ చూపి ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా, ఎంఎన్‌ఎం ప్రధాన కార్యదర్శి సంతోష్‌ బాబు కూడా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సంతోష్‌బాబు మాజీ ఐఏఎస్‌ అధికారి కావడం గమనార్హం.

Updated Date - 2021-05-14T17:13:47+05:30 IST