డీసీటీఎంగా పద్మావతి బాధ్యతలు స్వీకరణ
ABN , First Publish Date - 2021-10-26T06:21:37+05:30 IST
ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా కె.పద్మావతి సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు.
ద్వారకాబస్స్టేషన్, అక్టోబరు 25: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా కె.పద్మావతి సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. పీటీడీ విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (అర్బన్) కె.అప్పలనాయుడు నుంచి పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు డీసీటీఎంగా పనిచేసిన సుధాబిందు విజయనగరం జోన్ డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో తుని డిపో మేనేజర్గా పనిచేసిన పద్మావతి నియమితులయ్యారు.