ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-05-08T04:56:48+05:30 IST

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

 ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల

కారేపల్లి మే7: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని విశ్వనాధపల్లిలో కారేపల్లి సొసైటి, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు చేసిన మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, వైరా ఆత్మకమిటి చైర్మన్‌ ముత్యాల సత్యానారాయణ, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మల్లెల నాగేశ్వరరావు, ఎంపీపీ శకుంతల, స్థానిక సర్పంచ్‌ ఇంద్రజ్యోతి, ఎంపీటీసీ సభ్యులు వడ్డె ఆజేయబాబు, అజ్మీర వీరన్న, సొసైటి ఛైర్మన్‌ దుగ్గినేని శ్రీనివా్‌సరావు, వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివా్‌సరావు, తహసీల్దార్‌ పుల్లయ్య, ఎంపీడీవో రమాదేవి,తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

మండల పరిధిలోని మోకాళ్ల రామయ్య  గుంపులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే రాములునాయక్‌ ప్రారంభించారు.


Updated Date - 2021-05-08T04:56:48+05:30 IST