తెలంగాణ భవన్‌లో అమర జవాన్లకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-02-14T22:38:22+05:30 IST

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పుల్వామా అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.

తెలంగాణ భవన్‌లో అమర జవాన్లకు ఘన నివాళి

హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పుల్వామా అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ రాం మోహన్, సామాజికవేత్త డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. మౌనం పాటించారు. ఉగ్రదాడి జరిగిన మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఐ స్టాండ్ ఫర్ నేషన్’ అనే నినాదంతో ముందుకు వచ్చిన సుల్తాన్ అలీ, రమేశ్, రత్న రాజు, హరి కృష్ణ, ఏడబ్ల్యూజేఏ కోటేశ్వర రావు తదితరులమంతా కలిసి జవాన్లకు సంఘీభావం తెలపడం గర్వకారణంగా ఉందన్నారు. సైనికుల త్యాగాలకు ప్రతి ఒక్క భారతీయుడు సెల్యూట్ చేస్తున్నాడని తెలిపారు. 

Updated Date - 2020-02-14T22:38:22+05:30 IST