దూకుడుగా ఆడుతున్న పాక్
ABN , First Publish Date - 2021-10-25T03:27:17+05:30 IST
టీమిండియా నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ దూకుడుగా ఆడుతోంది.
దుబాయ్: టీమిండియా నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ దూకుడుగా ఆడుతోంది. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడుతూ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడుతోంది. ఓపెనర్లు బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్లు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఇద్దరూ కలిసి సంయమనంతో ఆడుతూ స్ట్రైక్ను రొటేట్ చేస్తున్నారు.
చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. రిజ్వాన్21, ఆజం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కోహ్లీ 57, పంత్ 39 పరుగులు చేశారు.