పాక్దే టీ-20 సిరీస్
ABN , First Publish Date - 2021-04-17T09:08:25+05:30 IST
దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ను పర్యాటక పాకిస్థాన్ 3-1తో కైవసం చేసుకొంది. శుక్రవారం జరిగిన ఆఖరి, నాలుగో టీ20లో పాక్ 3 వికెట్లతో గెలిచింది.
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ను పర్యాటక పాకిస్థాన్ 3-1తో కైవసం చేసుకొంది. శుక్రవారం జరిగిన ఆఖరి, నాలుగో టీ20లో పాక్ 3 వికెట్లతో గెలిచింది. తొలుత వాన్డర్ డుస్సెన్ (52) అర్ధ సెంచరీతో సౌతాఫ్రికా 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. హసన్ అలీ, ఫహీమ్ అష్రాఫ్ చెరి 3 వికెట్లు తీశారు. ఛేదనలో ఫఖర్ జమాన్ (60) హాఫ్ సెంచరీతో పాటు మహ్మద్ నవాజ్ (25 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24) రాణించడంతో పాక్ 19.5 ఓవర్లలో 149/7 స్కోరు చేసి నెగ్గింది.