అఫ్ఘాన్లోని భారతీయ నిపుణులే లక్ష్యంగా పాక్ దాడులు !
ABN , First Publish Date - 2020-09-22T15:47:44+05:30 IST
అఫ్ఘనిస్థాన్లోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోందని విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ ఆరోపించారు.
విదేశాంగ మంత్రి మురళీధరన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: అఫ్ఘనిస్థాన్లోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోందని విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ ఆరోపించారు. 12 ఏళ్లుగా దాడులు, కిడ్నాపులతో వారిని భయబ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన ఈ మేర కు సమాధానమిచ్చారు. అఫ్ఘాన్ ప్రభుత్వ సహకారంతో వారి కుట్రలను భగ్నం చేస్తూ మన వాళ్లను కాపాడుకుంటున్నామన్నారు.