T20 వరల్డ్ కప్: ఆసీస్ విజయలక్ష్యం 177 పరుగులు

ABN , First Publish Date - 2021-11-12T02:46:29+05:30 IST

దుబాయ్: T20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న 2వ సెమీఫైనల్‌లో పాకిస్తాన్

T20 వరల్డ్ కప్: ఆసీస్ విజయలక్ష్యం 177 పరుగులు

దుబాయ్: T20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న 2వ సెమీఫైనల్‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ 34, మహ్మద్ రిజ్వాన్ 67, పరుగులు చేసి అవుటయ్యారు. ఫఖర్ జమాన్ 55 పరుగులు చేశాడు. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని బాబర్ నేతృత్వంలోని పాక్ జట్టుకు బ్యాటింగ్‌ అప్పగించింది.




ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కి ఇది ఐదో సెమీఫైనల్‌ కాగా... ఆస్ట్రేలియాకు 4వ సెమీఫైనల్. పాక్ జట్టు తొలి మ్యాచ్‌లోనే భారత్‌పై విజయం సాధించడంతో పాటు ఈ సారి ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూడకుండా సెమీస్‌కు దూసుకొచ్చిన ఏకైక జట్టుగా నిలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే ఒకసారి T20 ప్రపంచకప్ విజేత కాగా... మరోసారి కప్ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో విజేతగా నిలవాలని ఆస్ట్రేలియా జట్టు కూడా పట్టుదలతో ఉంది. 

Updated Date - 2021-11-12T02:46:29+05:30 IST