Pakistan:ప్రముఖ క్రికెటర్ యాసిర్ షాపై కేసు
ABN , First Publish Date - 2021-12-21T12:57:50+05:30 IST
పాక్ ప్రముఖ క్రికెటరుపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన సంచలనం రేపింది....
ఇస్లామాబాద్ : పాక్ ప్రముఖ క్రికెటరుపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన సంచలనం రేపింది. పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం, వేధింపులకు సహకరించాడనే ఆరోపణలపై ఇస్లామాబాద్లోని షాలిమార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యాసిర్ షా స్నేహితుడు ఫర్హాన్ తనకు తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారం చేశాడని, ఆపై ఆ చర్యను చిత్రీకరించాడని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన గురించి అధికారుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని యాసిర్ షా హెచ్చరించినట్లు బాలిక పేర్కొంది.ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది.
తాము ఈ ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నామని, పూర్తి వాస్తవాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే వ్యాఖ్యానిస్తామని పీసీబీ పేర్కొంది. యాసిర్ షా పాకిస్తాన్ తరపున 46 టెస్టులు ఆడాడు. యాసిర్ 8/41తో 235 వికెట్లు తీయగలిగాడు. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది, ఈ విషయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొంది.