తొలి టీ20లో పాక్ గెలుపు
ABN , First Publish Date - 2021-04-11T09:02:49+05:30 IST
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్సలో పర్యాటక పాకిస్థాన్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టీ20లో పాక్ 4 వికెట్లతో గెలిచింది. తొలుత ఐడెన్ మార్క్రమ్ (51), కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ (50) అర్ధ సెంచరీలతో...
జొహాన్నె్సబర్గ్: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్సలో పర్యాటక పాకిస్థాన్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టీ20లో పాక్ 4 వికెట్లతో గెలిచింది. తొలుత ఐడెన్ మార్క్రమ్ (51), కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ (50) అర్ధ సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు సాధించింది. ఛేదనలో మహ్మద్ రిజ్వాన్ (74 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగడంతో పాక్ 19.5 ఓవర్లలో 189/6 స్కోరు చేసి నెగ్గింది. ఫహీమ్ అష్రాఫ్ 30, ఫఖర్ జమాన్ 27 రన్స్తో మెరిశారు.