బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన పల్లా
ABN , First Publish Date - 2021-06-18T02:59:48+05:30 IST
గాజువాక జంక్షన్లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టును మాజీ ఎమ్మెల్యే
విశాఖపట్నం: గాజువాక జంక్షన్లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టును మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తన భవనాన్ని కూల్చి వేశారని ఆరోపించారు. కోటీ 86 లక్షల నష్టం వాటిల్లిందని, దానిని అధికారులు చెల్లించాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ పోలీస్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులను చేర్చారు. అందరిపైనా వ్యక్తిగతంగా పిటిషన్ను పల్లా శ్రీనివాస్ దాఖలు చేసారు. నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.