ఆర్థిక వృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంది: పల్లా రాజేశ్వరరెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T18:26:51+05:30 IST

హైదరాబాద్: టీఆర్ఎస్ అవినీతిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత పల్లా రాజేశర్వరరెడ్డి ఖండించారు.

ఆర్థిక వృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంది: పల్లా రాజేశ్వరరెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ అవినీతిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత పల్లా రాజేశర్వరరెడ్డి ఖండించారు. ఆర్థిక వృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ పరిమితికి లోబడే ప్రభుత్వం లోన్స్ తీసుకొస్తోందన్నారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. 2004 నుంచి 14 వరకు ఒక్క ప్రాజక్టును కూడా కాంగ్రెస్ పూర్తి చేయలేదన్నారు. తాము కడుతున్న ప్రాజక్టులకు లెక్కలతో సహా చర్చకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ నాయకులు జీవచ్ఛాలతో సమానమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాకు ఏమి చేశాడో కోమటిరెడ్డి చెప్పాలని పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-01-27T18:26:51+05:30 IST