స్టీల్ ఫ్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయరు?: పల్లా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-12-26T20:31:54+05:30 IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు పొరాటం చేయడం లేదని...

స్టీల్ ఫ్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయరు?: పల్లా శ్రీనివాసరావు

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు పొరాటం చేయడం లేదని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు..  గంగవరం పోర్ట్‌లో రాష్ట్ర వాటాను ఆదానీకి ఎందుకు అమ్మేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వైసీపీ ద్వంద్వ వైఖరి వదిలి పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్త శుద్ధితో పోరాటం చేయాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే వరకు తెలుగు దేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-26T20:31:54+05:30 IST