AP: పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-14T13:15:33+05:30 IST
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 36 సర్పంచ్, 68 పంచాయతీ వార్డు మెంబర్లకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం లక్షా 32 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లెక్కింపు ప్రారంభం కానుంది. అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు.