వట్టివాగులో పంచాయతీ కార్యదర్శి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-03-14T16:05:12+05:30 IST

కుమురం భీమ్: వట్టివాగు వద్ద అదృశ్యమైన పంచాయతీ కార్యదర్శి మృతదేహం వట్టివాగులో లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

వట్టివాగులో పంచాయతీ కార్యదర్శి మృతదేహం లభ్యం

కుమురం భీమ్: వట్టివాగు వద్ద అదృశ్యమైన పంచాయతీ కార్యదర్శి మృతదేహం వట్టివాగులో లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. తిర్యాణి  మండల మంగి పంచాయతీ కార్యదర్శి ఆలీబాబా వట్టివాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మీటింగ్ ఉందని ఆలీబాబా నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. వట్టివాగు ప్రాజెక్టుపై బండి, చెప్పులు, సెల్ ఫోన్ కనిపించగా.. స్థానికులు వట్టివాగులో గాలించారు. దీంతో అతని మృతదేహం లభ్యమైంది. కాగా.. ఆలీబాబా ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు.


Updated Date - 2020-03-14T16:05:12+05:30 IST