ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి‎ అబద్దాలు చెప్పటం సిగ్గుచేటు: అనురాధ

ABN , First Publish Date - 2021-11-15T02:36:34+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగుల వెనుక రక్తసంబందీకులే ఉన్నారని నిర్ధారణ అయ్యాక కూడా ‎...

ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి‎ అబద్దాలు చెప్పటం సిగ్గుచేటు: అనురాధ

విజయవాడ: వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగుల వెనుక రక్తసంబందీకులే ఉన్నారని నిర్ధారణ అయ్యాక కూడా ‎వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి‎ అబద్దాలు చెప్పటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.  శ్రీకాంత్ రెడ్డి‎ చెబుతున్న అబద్దాలు విని వివేకానందరెడ్డి ఆత్మఘోషిస్తోందని ఆమె విమర్శించారు. వివేకా హత్యపై తప్పుడు ప్రకటనలు చేసిన విజయసాయిరెడ్డి, సహా వైసీపీ నేతలు ఇప్పటికే చిక్కుల్లో పడ్డారన్నారు. ‘‘వాళ్లను చూసైనా శ్రీకాంత్ రెడ్డి నిజాలు మాట్లాడాలి. వివేకా హత్య కేసులో ఎల్లో మీడియా అబద్దపు ప్రచారం చేస్తోందని ‎ మాట్లాడటానికి సిగ్గనిపించటం లేదా?. అసత్య ప్రచారం చేసిందెవరు? గొడ్డలిపోటుతో చనిపోతే గుండెపోటన్నది ఎవరు? మీ బులుగు మీడియా,  వైసీపీ నేతలు కాదా?. వివేకా హత్యలో అసలు వాస్తవాలు బయటపడ్డాక కూడా వైసీపీ నేతలు అబద్దాలు చెప్పటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికారం, అవినీతి డబ్బుల  కోసం వైయస్ కుటుంబం ఎంతకైనా దిగజారుతుందని వివేకా హత్యతో మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసింది. శ్రీకాంత్ రెడ్డి ఇంకా నీ బుర్రకధలు ఎవరికి చెబుతావు? మీ అబద్దాలు, దొంగ నాటకాలన్నీ ప్రజలు తెలుసు.’’ అని పంచుమర్తి అనురాధ విమర్శించారు. 

Updated Date - 2021-11-15T02:36:34+05:30 IST