ఎమ్మెల్సీగా పండుల ప్రమాణం
ABN , First Publish Date - 2020-08-15T08:45:28+05:30 IST
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి అసెంబ్లీలోని తన చాంబర్లో శానసమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, రవీంద్రబాబు చేత ప్రమాణస్వీకారం చేయించారు...
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి అసెంబ్లీలోని తన చాంబర్లో శానసమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, రవీంద్రబాబు చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.