పర్యాటక కేంద్రంగా పాన్‌గల్‌ ఖిల్లా

ABN , First Publish Date - 2021-12-07T04:20:59+05:30 IST

మండల కేంద్రంలోని దుర్గం గట్ట్టు(ఖిల్లా)ను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు సోమవారం జిల్లా అధికారుల బృందం గట్ట్టును సందర్శించారు.

పర్యాటక కేంద్రంగా పాన్‌గల్‌ ఖిల్లా
పాన్‌గల్‌ ఖిల్లాపై పురాతన కట్టడాలను పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

- ఖిల్లాను సందర్శించిన జిల్లా అధికార బృందం

పాన్‌గల్‌, డిసెంబరు 6 : మండల కేంద్రంలోని దుర్గం గట్ట్టు(ఖిల్లా)ను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు సోమవారం జిల్లా అధికారుల బృందం గట్ట్టును సందర్శించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ఆదేశాల మేరకు దుర్గం గట్టుపై ఉన్న పురాతణ కట్ట డాలు, శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాన్‌గల్‌ ఖిల్లాను ప ర్యాటక కేంద్రంగా చేసేందుకు వెంటనే నివేదికను తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు మునీరుద్దిన్‌, అఽధికారుల బృందం, పంచా యతీరాజ్‌ ఈఈ మల్లయ్య, డీఈ చెన్నయ్య, ఏఈ సత్తయ్య, మండల ప్రత్యేక అధికారి సురే ష్‌, తహసీల్దార్‌ చక్రపాణి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ మహేష్‌, సర్పంచు సింగిరెడ్డి గోపా ల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాముయాదవ్‌, నాయకులు రవికుమార్‌రెడ్డి, సాయిలు, జ్యోతినందన్‌, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T04:20:59+05:30 IST