జామతోటకు కాగితపు పువ్వులు
ABN , First Publish Date - 2021-01-21T06:09:09+05:30 IST
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునుర్పల్లి గ్రామశివారు రాజీవ్రహదారి పక్కన దాదాపు 7 ఎకరాల్లో రైతు ప్రవీణ్రెడ్డి తైవాన్ రకం జామకాయలు పండిస్తున్నారు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునుర్పల్లి గ్రామశివారు రాజీవ్రహదారి పక్కన దాదాపు 7 ఎకరాల్లో రైతు ప్రవీణ్రెడ్డి తైవాన్ రకం జామకాయలు పండిస్తున్నారు. రహదారికి పక్కనే తోట ఉండడంతో కాయకు దుమ్ము మచ్చలు రాకుండా దాదాపు 80వేల కాగితపు తొడుగులు తొడిగారు. జామకాయలకు దుమ్ముధూళి నుంచి రక్షణ లభించడంతో పాటూ కాయకు సహజంగా ఏర్పడే మచ్చలు రావని, అధిక దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు.
- సిద్దిపేట జిల్లా స్టాఫ్ ఫొటోగ్రాఫర్