పీఆర్సీపై ప్యాప్టో నేతల నిరసన
ABN , First Publish Date - 2022-01-17T05:10:06+05:30 IST
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద ఆదివారం ప్యాప్టో నేతలు నిరసన వ్యక్తం చేశారు.
రాజంపేట, జనవరి 16: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద ఆదివారం ప్యాప్టో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక పెన్షనర్లకు ముఖ్యమంత్రి చేస్తున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ నెల 20వ తేదీ కడప కలెక్టరేట్ను ముట్టడి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నేతలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్యాప్టో నేతలు సత్యనారాయణ, నాగేశ్వరగౌడ్, చెంగల్రాజు, నరసింహులు, సుబ్బారెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.