పీఆర్‌సీపై ప్యాప్టో నేతల నిరసన

ABN , First Publish Date - 2022-01-17T05:10:06+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద ఆదివారం ప్యాప్టో నేతలు నిరసన వ్యక్తం చేశారు.

పీఆర్‌సీపై ప్యాప్టో నేతల నిరసన
రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ప్యాప్టో నేతలు

రాజంపేట, జనవరి 16: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద ఆదివారం ప్యాప్టో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక పెన్షనర్లకు ముఖ్యమంత్రి చేస్తున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ నెల 20వ తేదీ కడప కలెక్టరేట్‌ను ముట్టడి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నేతలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్యాప్టో నేతలు సత్యనారాయణ, నాగేశ్వరగౌడ్‌, చెంగల్‌రాజు, నరసింహులు, సుబ్బారెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:10:06+05:30 IST