పారా అథ్లెట్ల జోరు
ABN , First Publish Date - 2021-12-04T08:41:47+05:30 IST
ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్లో భారత అథ్లెట్లు పతకాలతో సత్తాచాటారు.
మనామా (బహ్రెయిన్): ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్లో భారత అథ్లెట్లు పతకాలతో సత్తాచాటారు. శుక్రవారం జరిగిన పోటీల్లో ఓ స్వర్ణం సహా మూడు పతకాలు సాధించారు. మహిళల క్లబ్ త్రో ఈవెంట్లో కాశిష్ లక్రా పసిడి గెలిచింది. పురుషుల జావెలిన్ త్రోలో లక్షిత్ కాంస్యం, షాట్పుట్లో సంజయ్ ఆర్ నీలమ్ కాంస్య పతకాలుదక్కించుకున్నారు.