నిండుకుండలా పరగోడు డ్యామ్‌

ABN , First Publish Date - 2021-11-19T18:02:54+05:30 IST

చిక్కబళ్ళాపుర జిల్లాలో రెండు దశాబ్దాల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, బావులు జలకళ సంతరించుకున్నాయి. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో బాగేపల్లి

నిండుకుండలా పరగోడు డ్యామ్‌

బాగేపల్లి(బెంగళూరు): చిక్కబళ్ళాపుర జిల్లాలో రెండు దశాబ్దాల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, బావులు జలకళ సంతరించుకున్నాయి. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో బాగేపల్లి తాలూకాలోని పరగోడు డ్యామ్‌ జలకళ సంతరించుకుంది. డ్యామ్‌ నుంచి నీరు ప్రవహిస్తున్న ఫొటోలు కొందరు డ్రోన్‌ కెమెరాతో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా గురువారం వైరల్‌ అయ్యింది. కాగా బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో బాగేపల్లి, గుడిబండ తాలూకాలలో జోరు వర్షం కురుస్తోంది. నందికొండల నుంచి వస్తున్న వర్షపునీటితో పలు చెరువులు, కుంటలు నిండి చిత్రావతికి చేరుతున్నాయి. ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేశారు. పరగోడు ప్రాజెక్టునుంచి తీమాకలపల్లి, జిలకరపల్లి మీదుగా నీరు ప్రవహిస్తోంది. మరవపారుతున్న నీటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు, పొరుగు ప్రాంతాలవారు తరలివస్తున్నారు. ప్రాజెక్టును చూసేందుకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని దేవరెడ్డిపల్లి గ్రామస్తుడు భాస్కరరెడ్డి అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-19T18:02:54+05:30 IST