ప్రశాంతి నిలయంలో ఆయుధపూజ
ABN , First Publish Date - 2020-10-25T09:30:35+05:30 IST
ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు హాల్లో స త్యసాయిబాబా బంగారు రథం, కార్లకు ట్రస్టుసభ్యులు ఆర్జే రత్నాకర్ పూజలు చేశారు.
పుట్టపర్తి, అక్టోబరు 24: ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు హాల్లో స త్యసాయిబాబా బంగారు రథం, కార్లకు ట్రస్టుసభ్యులు ఆర్జే రత్నాకర్ పూజలు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భా గంగా శనివారం సాయికుల్వంతు మందిరానికి బంగారు రథం, కార్లను తీసుకువచ్చి అలంకరించి పూజలు చేశారు. పూర్ణచంద్రహాల్లో ఆరో రోజు వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కొనసాగింది. వందలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాఽధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుసభ్యులు చక్రవర్తి, ప్రసాదరావు పాల్గొన్నారు.