శ్రీశైలంలో పార్సిల్ కలకలం
ABN , First Publish Date - 2020-09-25T08:13:10+05:30 IST
శ్రీశైలంలో అన్యమత పార్సిల్ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన
కర్నూలు అర్బన్, సెప్టెంబరు 24: శ్రీశైలంలో అన్యమత పార్సిల్ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్సిల్ వచ్చింది.
దానిపై కల్వరి టెంపుల్ చిరునామా ఉంది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ పార్సిల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ పార్సిల్లో నిత్యావసర వస్తువులున్నాయి.