లాక్డౌన్ ఎఫెక్ట్: డబ్బుల్లేక 2నెలల బిడ్డను అమ్మేసిన పేరెంట్స్!
ABN , First Publish Date - 2020-06-07T04:23:10+05:30 IST
లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోవడంతో ఓ జంట.. ఘోరమైన నిర్ణయం తీసుకుంది.
కోల్కతా: లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోవడంతో ఓ జంట.. ఘోరమైన నిర్ణయం తీసుకుంది. తమ రెండు నెలల పసిబిడ్డను రూ.3వేలకు అమ్మేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగుచూసింది. రోజు కూలీగా పనిచేసే ఆ దంపతులు తమ బిడ్డకు కనీసం ఆహారం కూడా అందించలేని స్థితిలో ఉన్నారట. దీంతో చేసేదేంలేక దూరపు చుట్టాలకు బిడ్డను అమ్మేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.