ధూళ్లిపాళ్ల వీరయ్య, పరిటాల రవీలు పేదల కోసం పోరాడిని యోఽధులు

ABN , First Publish Date - 2022-01-25T05:17:43+05:30 IST

ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్రలు పేదల ప్రజలకోసం పోరాడిన యోధులని జిల్లా టీడీపీ నేతలు కొనియాడారు.

ధూళ్లిపాళ్ల వీరయ్య, పరిటాల రవీలు పేదల కోసం పోరాడిని యోఽధులు
ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళలర్పిస్తున్న టీడీపీ నేతలు రవీంద్ర, దాసరి రాజామాష్టారు తదితరులు

జిల్లా టీడీపీ నేతలు

గుంటూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్రలు  పేదల ప్రజలకోసం పోరాడిన యోధులని జిల్లా టీడీపీ నేతలు కొనియాడారు. వీరిద్దరి వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళర్పించారు.  ఈ సందర్భంగా పాల్గొన్న నేతలు మాట్లాడుతూ,  సంగం డెయిరీని స్థాపించటంలోనూ దానిని అభివృద్ధి చేయడంలోనూ వీరయ్య చౌదరి సేవలు వెలకట్టలేనివన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైన సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం పార్టీకి నేటికి తీరని లోటన్నారు. అలానే పరిటాల రవీంద్ర లాంటి నాయకుడు లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ప్రస్తుత జగన్మోహనరెడ్డి ఆరాచాక పాలనపై పోరాడటమే వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్రకు ఘనమైన నివాళి అని నేతలు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొవెలమూడి రవీంద్ర, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, దాసరి రాజామాష్టారు, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు, వేమలుపల్లి శ్రీరాం ప్రసాద్‌, ఈరంటి వరప్రసాద్‌,  కొమ్మినేని కోటేశ్వరరావు, రావిపాటి సాయి, దామచర్ల శ్రీనివాసరావు, మానంశ్రీనివాసరావు, మద్దిరాల గంగాధర్‌, ముత్తినేని రాజేశ, మద్దిరాల గంగాధర్‌, కసుకుర్తి హనుమంతరావు, ఉప్పల రామారావు, బెల్లంకొండ సురేష్‌, చెరుకుపల్లి నాగరాజు, మునగా గణపతి, గడ్డిపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T05:17:43+05:30 IST