మహాపాదయాత్రకు సంఘీభావంగా పరిటాల సునీత పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-16T21:44:30+05:30 IST

మహాపాదయాత్రకు సంఘీభావంగా గురువారం పరిటాల సునీత యాత్ర చేపట్టారు.

మహాపాదయాత్రకు సంఘీభావంగా పరిటాల సునీత పాదయాత్ర

అనంతపురం: అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా గురువారం మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత యాత్ర చేపట్టారు. వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ నుంచి.. తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.  ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని.. ఏపీ రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేస్తూ సునీత పాదయాత్ర సాగింది.

Updated Date - 2021-12-16T21:44:30+05:30 IST