వచ్చే నెల 29 నుంచి పార్లమెంటు!

ABN , First Publish Date - 2021-10-23T08:12:18+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పార్లమెంటు

వచ్చే నెల 29 నుంచి పార్లమెంటు!

న్యూఢిల్లీ, అక్టోబరు 22: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు శుక్రవారం తెలిపాయి. డిసెంబరు 23న ముగుస్తాయని చెప్పాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ తేదీలపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందున్న నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - 2021-10-23T08:12:18+05:30 IST