పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : డీఎల్పీవో
ABN , First Publish Date - 2021-06-14T05:15:24+05:30 IST
సిద్దవటం గ్రామ పంచాయతీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శి అమర్నాథకు సూచించినట్లు రాజంపేట డీఎల్పీవో నాగరాజు పేర్కొన్నారు.
సిద్దవటం, జూన్ 13 : సిద్దవటం గ్రామ పంచాయతీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శి అమర్నాథకు సూచించినట్లు రాజంపేట డీఎల్పీవో నాగరాజు పేర్కొన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆదివారం డీఎల్పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలోని అన్ని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్తో శుభ్ర పరచాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.