అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలి
ABN , First Publish Date - 2021-10-24T04:43:01+05:30 IST
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో అధికారులు, సర్పంచులు భాగస్వామ్యులు కావాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.
ఎమ్మెల్యే కిలివేటి
నాయుడుపేట/టౌన్, అక్టోబరు 23 : గ్రామ పంచాయతీల అభివృద్ధిలో అధికారులు, సర్పంచులు భాగస్వామ్యులు కావాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల విద్యాశాఖాధికారి పాఠశా లలను ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి విద్యార్థులకు మంచి బోధన, నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులపై ఆయాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కట్టాజ్యోతి, ఏఎంసీ చైర్మన్ ఓట్టూరు రాధాకిశోర్, తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో శివప్రసాద్, అన్నిశాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.