పార్టీకి పునర్వైభవమే లక్ష్యం: కువైట్ ఎన్నారై తెలుగుదేశం
ABN , First Publish Date - 2020-12-05T07:57:44+05:30 IST
దశాబ్దాల నుంచి విభిన్న వర్గాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఎన్నారై తెలుగుదేశం కువైట్, ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్, నవ్యాంధ్ర
అబు హలీఫా: దశాబ్దాల నుంచి విభిన్న వర్గాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఎన్నారై తెలుగుదేశం కువైట్, ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్, నవ్యాంధ్ర తెలుగుదేశం కువైట్, తెలుగు యువత, ఎన్నారై తెలుగుదేశం కువైట్ బీసీ విభాగం, ఎన్నారై తెలుగుదేశం కువైట్ ముస్లిం మైనారిటీ విభాగం, వివిధ తెలుగుదేశం, నందమూరి అనుబంధ సంస్థలు కలిసి ఒకే ఎజెండాతో పనిచేయాలని తీర్మానించారు. శుక్రవారం అబు హలీఫాలో కువైట్లోని తెలుగుదేశం విభాగాలకు సంబంధించిన సభ్యులు సమావేశమయ్యారు. అందరూ కలసికట్టుగా పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధిష్టానం కూడా అభినందిస్తూ లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన విషయాన్ని సభ్యులకు వివరించారు.
తెలుగుదేశం పార్టీ సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలు:
స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులతో క్షేత్ర స్థాయిలో పని చేసేలా ప్రణాళికలు.
పార్లమెంటు, మండల, డివిజన్ వారీ నాయకుల సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం.
పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజల్లోకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తీసుకెళ్లాలి.
అన్నీ వర్గాలు బేషరతుగా కలిసి పార్టీ విజయం కోసం పనిచేయాలి.
నియోజకవర్గ సమస్యలపై కూడా చట్టసభల్లో మాట్లాడాలని ‘జూమ్ సమావేశాల’ ద్వారా స్థానిక ప్రజ ప్రతినిధులకు విన్నవించాలి.
‘ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం, ప్రవాసాంధ్రుల సమస్యలపై పోరాటం చేసేలా కార్యక్రమాలు ఖరారు చేసుకుని, పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేయాలి’ అని ఈ సందర్భంగా బలరామ్ నాయుడు తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో స్థానిక నేతల సమన్వయ సమావేశాల ద్వారా(జూమ్ సమావేశాలతో) కేడర్కు భరోసా ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక నుంచి పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తానని వెంకట్ కోడూరి తెలియజేశారు. ‘తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏఏ వర్గాలు దూరమయ్యాయనేది తెలుసుకుని అటువంటి వర్గాలకు దగ్గరవడానికి మా వంతు కృషి చేసి స్థానిక ఎన్నికలలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తాం’ అని నాగేంద్ర బాబు అక్కిలి అన్నారు.
పార్టీ కోసం ప్రవాసాంధ్ర కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారని, అటువంటి కేడర్కు ఏ అవసరం వచ్చినా పార్టీ నిలబడాలని, ఇటువంటి సమయంలో కేడర్ను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి కూడా ఉందని షేక్ రహంతుల్లా తెలిపారు. అదే విధంగా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. ఈ సమావేశంలో ఇతర ముఖ్య నాయకులు ఉదయ్ ప్రకాష్, శ్రీనివాస చౌదరి, ముస్తాక్ ఖాన్, రాము యాదవ్, కరీం టి, మోహన్ రాచూరి, షేక్ యం డి. అర్షద్, భాస్కర్ నాయుడు మల్లరపు, మల్లికార్జున నాయుడు, బాష, బాబా సాహెబ్, కదీర్ బాషా పాల్గొని తమకు పదవుల కంటే పార్టీ అధికారంలోకి తిరిగి రావడం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉండడమే ముఖ్యమని తెలిపారు.