కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో ఆదరణ
ABN , First Publish Date - 2020-08-04T10:03:04+05:30 IST
కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో ఆదరణ లభిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి పేరాల శేఖర్
యాచారం: కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో ఆదరణ లభిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు బాషా వారిని రాష్ట్ర పార్టీ కార్యాల యంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకందేలా ప్రతీ కార్యకర్త చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం బాషాను సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మండలంలోని తక్కళ్లపల్లి, తక్కళ్లపల్లితండా ఉపసర్పంచ్లు విజయ్నాయక్, శ్రీశైలం కొప్పు బాషాను ఘనంగా సన్మానించారు.