పాశం మృతి టీడీపీకి తీరనిలోటు
ABN , First Publish Date - 2021-10-24T04:36:03+05:30 IST
పాశం మధు అంజనీకుమార్ మృతి తెలుగు దేశం పార్టీకికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు.
రాచర్ల, అక్టోబరు 23 : పాశం మధు అంజనీకుమార్ మృతి తెలుగు దేశం పార్టీకికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాశం మధు అంజనీకుమార్ రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఆ కుటుంబాన్ని శనివా రం మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు యో గానంద్, మాజీ ఎంపీపీ గాలయ్య, మాజీసర్పంచ్ అల్లూరిరెడ్డి, రంగస్వామి, ఖా శింవలి, రవి, వెంకటపతి,శ్రీను, ఆదినారాయణ, గోవిం దు, రామకృష్ణ, సనావుల్లాఖాన్, కల్యాన్రెడ్డి, పాండు, వినాయక్, రాజేశ్వరరావు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.