కరోనాపై పోరుకు పఠాన్ సోదరుల భారీ సాయం

ABN , First Publish Date - 2020-04-07T02:15:07+05:30 IST

కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా యావత్ ప్రపంచదేశాల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. ఇప్పటికే లక్షలాది మంది జీవితాలను ఈ మహమ్మారి

కరోనాపై పోరుకు పఠాన్ సోదరుల భారీ సాయం

న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా యావత్ ప్రపంచదేశాల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. ఇప్పటికే లక్షలాది మంది జీవితాలను ఈ మహమ్మారి కబలించి వేసింది. అయితే ఈ భయంకరమైన వైరస్‌ను అడ్డుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. మరోవైపు ఇందుకు సహాయం కోసం విరాళలు సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో తమ వొంతు సహాయం అందించేందుకు పఠాన్ సోదరులు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ముందుకొచ్చారు. 


కరోనా కారణంగా రోడ్డున పడి ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపేందుకు తమ వొంతు సహాయం అందించారు. ఏకంగా 10వేల కిలోల బియ్యం, 700 కిలోల బంగాలదుంపలను వీరు పంపిణీ చేశారు. తమ సాయంపై యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ.. మాకు తోచిన సహాయం చేసేందుకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. రాబోయే రోజులు ఇంకా ప్రమాదకరంగా ఉంటాయి. ప్రజలు ఎవరూ ఇళ్లు వదలి బయటకు రావొద్దు. ఇంట్లోనే ఉంటూ.. మీ ఆరోగ్యం కాపాడుకోండి’’ అని అన్నాడు. 

Updated Date - 2020-04-07T02:15:07+05:30 IST