ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ రేసులో పతంజలి

ABN , First Publish Date - 2020-08-10T22:17:31+05:30 IST

ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానం కోసం అనేక కంపెనీలు పోటీ..

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ రేసులో పతంజలి

న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానం కోసం అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా దేశీయ ఆయుర్వేద ఔషధ సంస్థ పతంజలి కూడా ఈ స్పాన్సర్‌షిప్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో పతంజలి ప్రధాన ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ చేసేందుకు పతంజలి సిధ్ధంగా ఉందని, ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో 5 ఏళ్ళకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా, బాయ్‌కాట్ చైనా వంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ వివోను స్పాన్సర్ షిప్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ల కోసం బిడ్డింగ్ నిర్వహించనుంది. ఈ బిడ్డింగ్‌లో పతంజలి కూడా పాల్గొననుంది.

Updated Date - 2020-08-10T22:17:31+05:30 IST