అంబులెన్స్ రాకపోవడంతో తల్లిని ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్లారంటే...

ABN , First Publish Date - 2021-08-07T17:44:45+05:30 IST

మనదేశంలోని శివారు గ్రామీణ ప్రాంతాల్లో...

అంబులెన్స్ రాకపోవడంతో తల్లిని ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్లారంటే...

ఫతేపూర్: మనదేశంలోని శివారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో, అక్కడి ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ పరిధిలోని ఒక గ్రామంలో వైద్యం కోసం అక్కడివారు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. అసోథర్ నివాసి సుఖ్రాజ్ భార్య శివకాళీ(58) ఇటీవల కింద పడిపోవడంతో పాదానికి ఫ్యాక్చర్ అయ్యింది.  


 వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో రోడ్లన్నీ పాడియిపోవడంతో, గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో ఆమె ఐదుగురు కుమారులు తల్లిని మంచంమీద పడుకోబెట్టి, ఆ మంచాన్ని తమ భుజాలకెత్తుకుని మూడు కిలోమీటర్లు నడిచి రోడ్డు మార్గం వరకూ తీసుకువెళ్లారు. అక్కడ ఒక ప్రైవేటు వాహనం సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్స అందించారు. 

Updated Date - 2021-08-07T17:44:45+05:30 IST