విమానంలో పట్నా వచ్చిన మహిళ లగేజీలో జ్యూయలరీ మాయం

ABN , First Publish Date - 2021-03-23T18:03:04+05:30 IST

పట్నా ఎయిర్‌పోర్టు వద్ద కలకలం చోటుచేసుకుంది.

విమానంలో పట్నా వచ్చిన మహిళ లగేజీలో జ్యూయలరీ మాయం

పట్నా: పట్నా ఎయిర్‌పోర్టు వద్ద కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి యూపీలోని పట్నాకు వచ్చిన ఒక ప్రయాణికురాలు తన లగేజీలోని రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. పట్నాలోని సిపారా ప్రాంతానికి చెందిన ప్రయాణికురాలు సంజూ... ఢిల్లీ నుంచి పట్నాకు విమానంలో వచ్చారు. తరువాత ఆమె తన లగేజీ తీసుకునేందుకు నిర్దేశిత ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తన లగేజీ చూసుకుని, అది తెరిచివుండటాన్ని చూసి ఆమె నిర్ఘాంతపోయారు. దానిలో ఉండాల్సిన రూ. 4 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు మాయమయ్యాయని ఆమె గుర్తించారు. వెంటనే ఆమె ఎయర్ పోర్టు అథికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు ఎయిర్ పోర్టు అంతటా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఢిల్లీలోనే ఈ చోరీ జరిగి ఉండవచ్చని పట్నా ఎయిర్‌పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ, ఢిల్లీ అధికారులకు ఫిర్యాదు చేశారు.



Updated Date - 2021-03-23T18:03:04+05:30 IST